ఆంధ్రుల హక్కు

ABN , First Publish Date - 2021-02-12T06:24:59+05:30 IST

విశాఖ ఉక్కు ప్రైవేటీకరిస్తారన్న వార్తల నేపథ్యంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఇటు కార్మికలోకం అటు రాజకీయ నాయకుల నినదిస్తున్నారు...

ఆంధ్రుల హక్కు

విశాఖ ఉక్కు ప్రైవేటీకరిస్తారన్న వార్తల నేపథ్యంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఇటు కార్మికలోకం అటు రాజకీయ నాయకుల నినదిస్తున్నారు. హక్కుల మాట ఎలా ఉన్నా, సెంటిమెంట్ సంస్థలను కాపాడలేవు. గత సంవత్సరమే ఇటువంటి సెంటిమెంట్ నినాదాలు ఒక సంస్థను నిలబెట్టలేవని ఆంధ్రాబ్యాంక్ విలీన సమయంలో రుజువైంది. ఆంధ్రాబ్యాంకును యూనియన్ బ్యాంకులో విలీనం చేస్తామని చెప్పినప్పుడు కూడా కార్మికులు రాజకీయ నాయకులు ఇలాగే నినదించారు. కానీ ఆంధ్రాబ్యాంకు అన్న పేరు చరిత్రలో కలిసిపోయింది. విశాఖ ఉక్కులో కేంద్ర ప్రభుత్వం పూర్తి యాజమాన్య హక్కులు కలిగివున్నది. ఆ సంగతి గుర్తెరిగి నినదించేవారు తమ పోరాటాన్ని మలచుకోవలసి ఉంటుంది.

పింగళి, విశాఖ

Updated Date - 2021-02-12T06:24:59+05:30 IST