తిరుపతి కోర్టు ఆవరణలో పోలీసులను తోసేసి రిమాండ్ ఖైదీ పరారు

ABN , First Publish Date - 2022-05-15T16:17:50+05:30 IST

తిరుపతి కోర్టు ఆవరణలో పోలీసులను తోసేసి రిమాండ్ ఖైదీ పరారు

తిరుపతి కోర్టు ఆవరణలో పోలీసులను తోసేసి రిమాండ్ ఖైదీ పరారు

తిరుపతి: తిరుపతి కోర్టు ఆవరణలో రిమాండ్ ఖైదీ పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టిన వెస్ట్ పోలీసులు తెలిపారు. ఎంఆర్ పల్లె పీఎస్ పరిధిలో ఎల్ఎస్ నగర్ టీటీడీ ప్లాట్స్‌లో బెంగుళూరుకు చెందిన నవీన్ దొంగతనం చేస్తూ పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు. దొంగ ఇంటి తాళాలు పగలగొట్టడంతో ఎల్‌హెచ్‌ ఎంఎస్ వ్యవస్థ అలారం ఇవ్వడంతో ఇంటిని చుట్టుముట్టి దొంగతనానికి వెళ్లిన నవీన్ అరెస్టు చేసినట్లు ఎంఆర్ పల్లె పోలీసులు పేర్కొన్నారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా నవీన్‌కు 14 రోజుల రిమాండ్ విధించినట్లు జడ్జి ఆదేశాలు ఇచ్చారు. సబ్ జైలు వద్ద పోలీసులను తోసేసి హ్యాండ్ కప్స్ తో రిమాండ్ ఖైదీ నవీన్ పరారయ్యారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెస్ట్ పోలీసులు వెల్లడించారు.

Updated Date - 2022-05-15T16:17:50+05:30 IST