సుందరకాండ పారాయణం అత్యంత ఫలదాయకం

ABN , First Publish Date - 2021-02-25T07:43:37+05:30 IST

టీటీడీ నిర్వహిస్తున్న సుందరకాండ పారాయణం అత్యంత ఫలదాయకమని ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు పేర్కొన్నారు.

సుందరకాండ పారాయణం అత్యంత ఫలదాయకం
సుందరకాండ పారాయణంలో పాల్గొన్న చాగంటి, ధర్మారెడ్డి తదితరులు

బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు


తిరుమల, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): టీటీడీ నిర్వహిస్తున్న సుందరకాండ పారాయణం అత్యంత ఫలదాయకమని ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు పేర్కొన్నారు. తిరుమల నాదనీరాజనం వేదికపై బుధవారం ఉదయం జరిగిన సుందరకాండ పారాయణంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చాగంటి ఉపన్యసిస్తూ.. ఎస్వీబీసీ ద్వారా సుందరకాండ శ్లోకాల శబ్ద తరంగాలు ప్రతి ఇంట్లో వ్యాపిస్తున్నాయని, దీనిద్వారా పాటిజివ్‌ ఎనర్జీ పెరిగి కరోనా వ్యాధి విముక్తికి మార్గం సుగమం అవుతుందన్నారు. ప్రపంచానికి ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని అందిస్తున్న టీటీడీకి కృతజ్ఞతలు తెలిపారు. రామకథ చనిపోయే వారిని కూడా బతికిస్తుందని వాల్మీకి మహర్షి తెలియజేశారని వివరించారు.

Updated Date - 2021-02-25T07:43:37+05:30 IST