భారత్ చేసిన తప్పు అదే.. వివరణ ఇచ్చిన ఫాసీ

ABN , First Publish Date - 2021-05-13T05:13:14+05:30 IST

భారతదేశాన్ని కరోనా మహమ్మారి ఎంతలా వణికిస్తుందో తెలిసిందే. దీనిపై అమెరికా సెనేటర్లకు అమెరికాకు చెందిన టాప్ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంథనీ ఫాసీ స్పందించారు.

భారత్ చేసిన తప్పు అదే.. వివరణ ఇచ్చిన ఫాసీ

వాషింగ్టన్: భారతదేశాన్ని కరోనా మహమ్మారి ఎంతలా వణికిస్తుందో తెలిసిందే. దీనిపై అమెరికా సెనేటర్లకు అమెరికాకు చెందిన టాప్ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంథనీ ఫాసీ స్పందించారు. భారత్‌లో కరోనా పరిస్థితిపై యూఎస్ సెనేట్‌లో జరిగిన చర్చలో ఆయన సెనేటర్లకు వివరణ ఇచ్చారు. ‘‘భారత్‌లో అంతకుముందే కరోనా వ్యాప్తి జరుగుతోంది. అయితే భారత్ తాము కరోనాను నియంత్రించామని భావించింది. దీంతో అర్ధంతరంగా లాక్‌డౌన్ ముగించేశారు. దాని ఫలితమే ఇప్పుడు మనందరికీ కనిపిస్తున్న భయంకర దృశ్యం’’ అని ఫాసీ అన్నారు. ఈ మేరకు యూఎస్ సెనేట్ హెల్త్, ఎడ్యుకేషన్, లేబర్ అండ్ పెన్షన్స్ కమిటీకి ఆయన వివరించారు.

Updated Date - 2021-05-13T05:13:14+05:30 IST