రెండోరోజు పాక్షికం

ABN , First Publish Date - 2022-10-03T04:32:41+05:30 IST

ప్రత్యక్షదైవం, ఆరోగ్యప్రదాత అయిన అరసవల్లి ఆదిత్యుడిని రెండోరోజు ఆదివారం కూడా సూర్యకిరణాలు తాకాయి. ఆకాశంలో మబ్బులు కమ్ముకోవడంతో ఆదిత్యుడి మూలవిరాట్‌ను పాక్షికంగా సూర్యకిరణాలు స్పృశించాయి.

రెండోరోజు పాక్షికం
అరసవల్లి ఆదిత్యుడి ఆలయంలో భక్తుల రద్దీ, మూలవిరాట్‌ను తాకుతున్న సూర్యకిరణాలు

ఆదిత్యుడిని తాకిన సూర్యకిరణాలు
అరసవల్లి, అక్టోబరు 2:
ప్రత్యక్షదైవం, ఆరోగ్యప్రదాత అయిన అరసవల్లి ఆదిత్యుడిని రెండోరోజు ఆదివారం కూడా సూర్యకిరణాలు తాకాయి. ఆకాశంలో మబ్బులు కమ్ముకోవడంతో ఆదిత్యుడి మూలవిరాట్‌ను పాక్షికంగా సూర్యకిరణాలు స్పృశించాయి. ఈ అద్భుత దృశ్యం చూసేందుకు ఉదయం నుంచి భక్తులు క్యూలో బారులుదీరారు. దూరప్రాంతాల నుంచి తరలివచ్చి ఆదిత్యుడ్ని దర్శించుకున్నారు. ఆదివారం ఆదిత్యుడికి రూ.4,58,607 ఆదాయం లభించింది. ఇందులో టిక్కెట్ల ద్వారా రూ.1,75,600, విరాళాల రూపంలో రూ.83,007, ప్రసాదాల విక్రయం ద్వారా రూ.2,00,000 ఆదాయం లభించినట్లు ఆలయ ఈవో హరిసూర్యప్రకాష్‌ తెలిపారు.

Updated Date - 2022-10-03T04:32:41+05:30 IST