రామప్ప ఆలయానికి సింగరేణి మైనింగ్తో ముప్పులేదు
ABN , First Publish Date - 2021-07-31T00:56:23+05:30 IST
యునెస్కో వారసత్వ జాబితాలో చేరిన రామప్ప ఆలయానికి సింగరేణి మైనింగ్తో
హైదరాబాద్: యునెస్కో వారసత్వ జాబితాలో చేరిన రామప్ప ఆలయానికి సింగరేణి మైనింగ్తో ముప్పులేదని సింగరేణి యాజమాన్యం వివరణ ఇచ్చింది. రామప్ప ఆలయానికి సింగరేణి మైనింగ్తో ఉన్న ముప్పుపై ఆంధ్రజ్యోతిలో వచ్చిన వరుస కథనాలపై సింగరేణి యాజమాన్యం స్పందించింది. ప్రతిపాదన దశలోనే వెంకటాపురం ఉపరితల గని ఉందని యాజమాన్యం తెలిపింది. సమగ్ర శాస్త్రీయ అధ్యయనం తర్వాతే ముందుకు వెళ్తామని పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వ సమ్మతి తర్వాతే తదుపరి కార్యాచరణ ఉంటుందని సింగరేణి తెలిపింది. రామప్ప పరిరక్షణకు తాము పూర్తిగా కట్టుబడి ఉన్నామని సింగరేణి యాజమాన్యం పేర్కొంది.