ముస్లింమైనార్టీలకు సీఎం ఇచ్చిన హామీలు నెరవేర్చాలి

ABN , First Publish Date - 2022-06-25T06:16:02+05:30 IST

ముస్లిం మైనార్టీలకు సీఎం జగన్‌ ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఎస్‌డీపీఐ నాయకులు నిరసన తెలిపారు. శుక్రవారం స్థానిక ఇందిరాసర్కిల్‌లో జరిగిన ధర్నాలో వారు మాట్లాడుతూ... ఎన్నికల సమ వైసీపీ అధినేత జగన్‌ తా ము అధికారంలోకి వస్తే ముస్లింలకు దుల్హన్‌ పథకం ద్వారా రూ.లక్ష ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చా రని, అయితే ప్రస్తుతం నిధులు లేవ ని చెప్పడం సిగ్గుచేటుగా ఉందన్నారు.

ముస్లింమైనార్టీలకు సీఎం ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
పుంగనూరులో ఎస్‌డీపీఐ నాయకుల నిరసన

పుంగనూరు, జూన్‌ 24: ముస్లిం మైనార్టీలకు సీఎం జగన్‌ ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఎస్‌డీపీఐ నాయకులు నిరసన తెలిపారు. శుక్రవారం స్థానిక ఇందిరాసర్కిల్‌లో జరిగిన ధర్నాలో  వారు మాట్లాడుతూ... ఎన్నికల సమ వైసీపీ అధినేత జగన్‌ తా ము అధికారంలోకి వస్తే ముస్లింలకు దుల్హన్‌ పథకం ద్వారా రూ.లక్ష ఇవ్వనున్నట్లు  హామీ ఇచ్చా రని, అయితే ప్రస్తుతం నిధులు లేవ ని చెప్పడం సిగ్గుచేటుగా ఉందన్నారు. రాజకీయ లబ్ధికోసం ఉచిత హామీలు ఇవ్వడం సరికాదన్నా రు. వైపీసీ నాయకుల మాటలు నమ్మి ఓటు వే స్తే అధికారంలోకి రాగానే అన్ని విధాలా ముస్లిం లను ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్య క్తం చేశారు. కార్యక్రమంలో  యూసఫ్‌, సమీర్‌లాల్‌, సిద్దిక్‌ తదితరులు పాల్గొన్నారు.  అలాగే టీడీపీ మైనార్టీ నాయకుడు సుహేల్‌బాషా విలేకరులతో మాట్లాడుతూ... వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముస్లింలను మోసం చేసిందని మండిపడ్డారు. టీడీపీ  అధికారంలో ఉన్న సమయంలో  మైనార్టీల పండుగలకు తోఫాలు, ముస్లిం యువతీ, యువకులకు పెళ్లిళ్లకు రుణాలు, మైనార్టీల అభివృద్ధి కోసం కార్పొరేషన్ల ద్వారా రాయితీ రుణాలు, ముత్తవల్లీకు గౌరవవేతనం ఇస్తుండగా ప్రస్తుతం అన్ని పథకాలు నిలిపివేయడం బాధకరమన్నారు. రానున్న ఎన్ని కల్లో వైసీపీ నాయకులకు తగిన బుద్ధి చెప్తా మన్నారు. సమావేశంలో నౌషాద్‌, నజీర్‌, సద్దాం, ఇమ్రాన్‌ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-06-25T06:16:02+05:30 IST