వీఆర్ఏలకిచ్చిన హామీలు నెరవేర్చాలి
ABN , First Publish Date - 2022-08-19T04:35:49+05:30 IST
వీఆర్ఏలకిచ్చిన హామీలు నెరవేర్చాలి
యాలాల/దౌల్తాబాద్/కులకచర్ల, ఆగస్టు 18: సర్వీసు విషయంలో వీఆర్ఏలకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, వారి సమస్యలను వెంటనే పరి ష్కరించాలని కార్మిక సంఘాల, రాజకీయ పార్టీల నాయకు లు అన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని వీఆర్ఏ లు కొన్నాళ్లుగా సమ్మె చేస్తున్నారు. యాలాలలో కొనసాగుతున్న వీఆర్ఏల సమ్మెకు మండల కాంగ్రెస్ నాయకులు సంఘీభావం తెలిపారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్ఏల సమ్మె శిబిరానికి వెళ్లి పార్టీ మండలాధ్యక్షుడు ఎ.భీమయ్య మాట్లాడుతూ.. వీఆర్ఏలకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగులకు ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. నాయకులు రాపోల్ నాగయ్య, ఖాసీం, నాగయ్య, రాగపూర్ చంద్రప్ప, శంకర్, నరేష్, బలరాం, వీరేందర్ పాల్గొన్నారు. దౌల్తాబాద్లో వీఆర్ఏల సమ్మెకు సీఐటీయూ వికారాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు బుస్స చంద్రయ్య మద్దతిచ్చి మాట్లాడారు. ఇప్పటికైనా వీఆర్ఏల న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలన్నారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏల జేఏసీ జిల్లా కో-చైర్మన్ గోపాల్, మోహన్, వీఆర్ఏలు బుగ్గప్ప, నవనీత, పుష్ప, సిద్ధప్ప, నర్సిములు, మాణిక్యప్ప, మారుతి పాల్గొన్నారు. కులకచర్లలో వీఆర్ఏల సమ్మెకు చౌడాపూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అశోక్కుమార్, నాయకులు సంఘీభావం తెలిపారు. శాసనసభలో సీఎం కేసీఆర్ వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటయ్యగౌడ్, కృష్ణారెడ్డి, నాయకులు, వీఆర్ఏలు పాల్గొన్నారు.