దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలి
ABN , First Publish Date - 2020-08-04T11:28:05+05:30 IST
కరోనా కారణంగా దివ్యాంగులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని అఖిల భారత దివ్యాంగుల సంస్థ జిల్లా అధ్యక్షుడు కట్టా ..
తణుకు, ఆగస్టు 3 : కరోనా కారణంగా దివ్యాంగులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని అఖిల భారత దివ్యాంగుల సంస్థ జిల్లా అధ్యక్షుడు కట్టా సతీశ్ అన్నారు. సోమవారం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ పీఎన్డీ ప్రసాద్కు అందజేశారు. కనీస ఫించన్ రూ.5 వేలు ఇవ్వాలని, కొత్త రేషన్కార్డులు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.