హిజ్రాల సమస్యలను పరిష్కరించాలి

ABN , First Publish Date - 2021-04-16T06:18:05+05:30 IST

ప్రభుత్వం హిజ్రాల సమస్యలను తక్షణమే పరిష్కరించాలంటూ గురువారం పట్టణంలోని అంబేద్కర్‌ చౌరస్తా వద్ద హిజ్రాలు అమరణ నిరహార దీక్ష చేపట్టారు.

హిజ్రాల సమస్యలను పరిష్కరించాలి

బాన్సువాడ టౌన్‌, ఏప్రిల్‌ 15: ప్రభుత్వం హిజ్రాల సమస్యలను తక్షణమే పరిష్కరించాలంటూ గురువారం పట్టణంలోని అంబేద్కర్‌ చౌరస్తా వద్ద హిజ్రాలు అమరణ నిరహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా యంగ్‌ ఇండియా ఫౌండేషన్‌ రాష్ట్ర అధ్యక్షురాలు గాయత్రి మాట్లాడుతూ ప్రభుత్వం హిజ్రాలకు ఆధార్‌ కార్డులు, పాన్‌ కార్డులు, ఓటరు ఐడీ కార్డులు, రేషన్‌ కార్డులు ఇవ్వాలన్నారు. డబుల్‌ బెడ్‌రూం కేటాయించాలని, రిజర్వేషన్‌ కల్పించాలని డిమాండ్‌ చేశారు.

అధికారులతో చర్చలు.. 

బాన్సువాడ డీఎస్పీ జైపాల్‌రెడ్డి, తహసీల్దార్‌ గంగాధర్‌, సీఐ రామకృష్ణారెడ్డి హిజ్రాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గురువారం  దీక్షా శిబిరంలో వారితో చర్చలు జరిపారు. దీంతో వారు దీక్షను విరమించారు. ఈ దీక్షలో ఉషారాదా, మున్ని, భవ్యశ్రీ, పూజ, సరస్వతీ తదితరులున్నారు.

Updated Date - 2021-04-16T06:18:05+05:30 IST