వ్యవసాయ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
ABN , First Publish Date - 2022-01-25T04:37:08+05:30 IST
వ్యవసాయ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
చేవెళ్ల, జనవరి 24: వ్యవసాయ కార్మిక సంఘం సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు జె.అంజయ్య డిమాండ్ చేశారు. సీపీఐ అనుబంధ సంస్థ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సోమవారం చేవెళ్ల ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి అధికారులకు వినతిపత్రం అందజేశారు. వ్యవసాయ కార్మికుల రక్షణకు సమగ్ర వ్యవసాయ కార్మిక చట్టం తేవాలన్నారు. కూలీలకు జీవితబీమా పథకాన్ని ప్రవేశపెట్టాలని కోరారు. పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు, రేషన్ కార్డులు అందించాలని డిమాండ్ చేశారు. జాతీయ ఉపాధిహమీ పథకాన్ని 100 నుంచి 200 రోజుల పనిదినాలకు పెంచి కూలీలకు రూ.600 పెంచాలన్నారు. కార్యక్రమంలో నాయకులు మల్లేశం, పెంటయ్య, సుధాకర్, మంజుల పాల్గొన్నారు.