వ్యవసాయ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2021-04-19T04:18:27+05:30 IST

వ్యవసాయ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

వ్యవసాయ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

  •  బీకేఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు కె. కాంతయ్య 

మహేశ్వరం : వ్యవసాయ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని బీకేఎంయూ (భారతీయ కేత్‌ మజ్దూర్‌ యూనియన్‌) రాష్ట్ర అధ్యక్షుడు కె.కాంతయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం మండల కేంద్రంలో బీకేఎంయూ 8వ మహాసభ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అనేక గ్రామాల్లో వ్యవసాయ కార్మికులు పనులు దొరక్క ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారన్నారు. ఉపాధిహామీ పని దినాలను పెంచాలన్నారు. కార్యక్రమంలో జంగయ్య, దత్తునాయక్‌, యాదయ్య, శంకర్‌, బ్రహ్మచారి, మహేష్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-19T04:18:27+05:30 IST