విద్యుత్‌ సమస్యను పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-05-18T05:51:28+05:30 IST

విద్యుత్‌ సమస్యను పరిష్కరించాలి

విద్యుత్‌ సమస్యను పరిష్కరించాలి
గ్రామస్తులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఆనంద్‌

 వికారాబాద్‌, మే 17 : కొత్త కాలనీలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను ఊరి బయటకు షిప్ట్‌ చేయాలని, గ్రామంలో విద్యుత్‌ సమస్యను పరిష్కరించాలని వికారాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ అన్నారు. మంగళవారం మీతో నేను కార్యక్రమంలో భాగంగా వికారాబాద్‌ మునిసిపల్‌ పరిధిలోని ధన్నారం, శ్రీరామ్‌నగర్‌ తండాలో పర్యటించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మిషన్‌ భగీరథ పైపులైన్‌కు గేట్‌ వాల్‌ ఏర్పాటు చేసి, ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్‌ ఇచ్చి నీటిని అందించాలన్నారు. వారానికి ఒకసారి వాటర్‌ ట్యాంక్‌ శుభ్రం చేయాలని, అంగన్‌వాడీ, ఆయా, ఏఎన్‌ఎంలు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆరోగ్యం, తదితర అంశాలపై అవగాహన కల్పిస్తూ ప్రజలకు సేవలు అందించాలన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా పాడుబడిన ఇళ్లను తొలగించాలని అన్నారు. అనంతరం లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను పంపిణీ చేశారు. అదేవిధంగా వికారాబాద్‌ మండలం బురాన్‌పల్లికి చెందిన అనిల్‌ కుమార్‌కు దళితబంధు ద్వారా మంజూరైన ట్రాక్టర్‌ను ఎమ్మెల్యే అందజేశారు. మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ మంజులారమేష్‌, కౌన్సిలర్‌ రాములు, వైస్‌చైర్మన్‌ శంషాబాద్‌ బేగం, పీఏసీఎస్‌ చైర్మన్‌ ముత్యంరెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-18T05:51:28+05:30 IST