రోజు రోజుకు పెరుగుతున్న తాగునీటి సమస్య
ABN , First Publish Date - 2022-06-25T06:20:48+05:30 IST
వర్షాకాలం ప్రారంభమైనా వర్షాలు కురవక పోవడంతో ఎర్రగొండపాలెం మండలంలో తాగునీటి బోర్లలో భూగర్భ జలమట్టం పడిపోయింది.
తాగునీటి బోర్లలో అడుగంటుతున్న భూగర్భజలాలు
ఎర్రగొండపాలెం, జూన్ 24 : వర్షాకాలం ప్రారంభమైనా వర్షాలు కురవక పోవడంతో ఎర్రగొండపాలెం మండలంలో తాగునీటి బోర్లలో భూగర్భ జలమట్టం పడిపోయింది. దీంతో ప్రజలు నీటికోసం ట్యాంకర్లుపైనే ఆధారపడుతున్నారు. మండలంలో ఇప్పటికీ, నిత్యం 240 ట్యాంకర్లు నీటిని ప్రజలకు వ్యవసాయబోర్ల నుంచి సేకరించి సరఫరా చేస్తున్నారు. ట్యాంకర్లు వచ్చిన సమయంలో ప్రజలు బిందెడు నీటికోసం పడిగాపులు కాచి నీళ్లు పట్టుకోవాల్సి వస్తోంది. మండలంలో అమానిగుడిపాడు గ్రామంలో 40 ట్యాంకర్లు, అయ్యంబొట్లపల్లి 12 ట్యాంకర్లు, బట్టువారిపల్లె 4, చిన్నబోయలపల్లి 5, చిన్నకొలుకుల 5, చెన్నరాయునిపల్లి 6, గంగుపల్లి 15, గురిజేపల్లి 4, గుర్రపుసాల 12 ట్యాంకర్లు, వాదంపల్లి 26 ట్యాంకర్లు, కాశికుంటతాండ 8, మెట్టబోడుతాండ 2, మొగుళ్లపల్లి 9, మిల్లంపల్లి పంచాయతీలో వికెనగర్ 15, మురారిపల్లె 39 ట్యాంకర్లు, వెంకటాద్రిపాలెం 18, రేగులపల్లి 4, తమ్మడపల్లి గ్రామంలో 11 ట్యాంకర్లు నీటిని ఆర్డబ్ల్యూఎస్ శాఖ ద్వారా సర్పంచులు ట్యాంకర్లు ద్వారా సరఫరా చేస్తున్నారు. వర్షాలు కురిస్తే తాగునీటి బోర్లలో భూగర్భజలాలు పెరుగుతాయని ప్రజలు వర్షాలు కోసం ఎదురుచూస్తున్నారు. వర్షాలు కురిసేనా తాగునీటి సమస్య పరిష్కారం అయ్యేనా అన్నట్లుగా తాగునీటి సమస్య నెలకొంది.