ఆయుధ కర్మాగారాల ప్రైవేటీకరణను నిలిపివేయాలి
ABN , First Publish Date - 2021-07-24T06:02:48+05:30 IST
ప్రభుత్వ రంగ ఆయుఽధ కర్మాగారాల ప్రైవేటీకరణను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని జిల్లా కార్మిక సంఘాల ఐక్య వేదిక నాయకులు డిమాండ్ చేశారు.
జిల్లా కార్మిక సంఘాల ఐక్య వేదిక డిమాండ్
జగిత్యాల అగ్రికల్చర్, జూలై 23: ప్రభుత్వ రంగ ఆయుఽధ కర్మాగారాల ప్రైవేటీకరణను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని జిల్లా కార్మిక సంఘాల ఐక్య వేదిక నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆయుధ కర్మాగారాల ప్రైవేటీకరణను నిరసిస్తూ క లెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఆయుధ కర్మాగార సంస్థలను కేంద్రం ప్రైవేటీకరణ చేసేందుకు అత్యవసర ఢిపెన్స్ సర్వీసెస్ ఆర్డినెస్ (ఈడీ ఎస్ఓ)చట్టాన్ని తెచ్చి ప్రైవేటీకరణకు పూనుకుంటోందన్నారు. ఈ చట్టా న్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐ టీయూ జిల్లా నాయకులు తిరుపతి నాయక్, ఐఎఫ్టీయూ జిల్లా నాయకులు చింత భూమేశ్వర్, ఏఐటీయూసీ జిల్లా నాయకులు ఎండీ ముఖ్రం తదితరులున్నారు.