ఆయుధ కర్మాగారాల ప్రైవేటీకరణను నిలిపివేయాలి

ABN , First Publish Date - 2021-07-24T06:02:48+05:30 IST

ప్రభుత్వ రంగ ఆయుఽధ కర్మాగారాల ప్రైవేటీకరణను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని జిల్లా కార్మిక సంఘాల ఐక్య వేదిక నాయకులు డిమాండ్‌ చేశారు.

ఆయుధ కర్మాగారాల ప్రైవేటీకరణను నిలిపివేయాలి
నిరసన తెలుపుతున్న జిల్లా కార్మిక సంఘాల నాయకులు

జిల్లా కార్మిక సంఘాల ఐక్య వేదిక డిమాండ్‌  

జగిత్యాల అగ్రికల్చర్‌, జూలై 23: ప్రభుత్వ రంగ ఆయుఽధ కర్మాగారాల ప్రైవేటీకరణను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని జిల్లా కార్మిక సంఘాల ఐక్య వేదిక నాయకులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆయుధ కర్మాగారాల ప్రైవేటీకరణను నిరసిస్తూ క లెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఆయుధ కర్మాగార సంస్థలను కేంద్రం ప్రైవేటీకరణ చేసేందుకు అత్యవసర ఢిపెన్స్‌ సర్వీసెస్‌ ఆర్డినెస్‌ (ఈడీ ఎస్‌ఓ)చట్టాన్ని తెచ్చి ప్రైవేటీకరణకు పూనుకుంటోందన్నారు. ఈ చట్టా న్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐ టీయూ జిల్లా నాయకులు తిరుపతి నాయక్‌, ఐఎఫ్‌టీయూ జిల్లా నాయకులు చింత భూమేశ్వర్‌, ఏఐటీయూసీ జిల్లా నాయకులు ఎండీ ముఖ్రం తదితరులున్నారు. 

Updated Date - 2021-07-24T06:02:48+05:30 IST