వైభవంగా నాభిశిల ప్రతిష్ఠ
ABN , First Publish Date - 2022-05-16T06:47:46+05:30 IST
మండలంలోని కొత్తపల్లి గ్రామంలో ఆదివారం నాభిశిల ప్రతిష్ఠ మహో త్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తదితరులు ఈ ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
దర్శి, మే 15 : మండలంలోని కొత్తపల్లి గ్రామంలో ఆదివారం నాభిశిల ప్రతిష్ఠ మహో త్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తదితరులు ఈ ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గర్త పూజ, యంత్రప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ఠ ప్రాణ ప్రతిష్ట, బింబకళాన్యాసం, జ్వాలాదర్శనం, మహకుంభబలి, తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం
ఐటీసీ సహకారంతో నిర్మిం చిన మంచినీటి ఆర్వో ప్లాంటు ను జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ శివప్రసాద్రెడ్డిలు ప్రారంభించారు. ఎంపీటీసీ సభ్యుడు ఇల్లూరి సుబ్బారెడ్డి, ఇల్లూరి నాగిరెడ్డిల ఆధ్వర్యంలో ఈ ప్లాంటు నిర్మిం చారు. గ్రామస్తుల మంచినీటి అవసరల కోసం ఆర్వో ప్లాంటు ఏర్పాటు ఆనంధదాయకమని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్రామారావు, వైసిపీ నాయకుడు ఇల్లూరి మల్లిఖార్జున తదితరులు పాల్గొన్నారు.