స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముస్తాబైన కలెక్టరేట్ ప్రాంగణం
ABN , First Publish Date - 2020-08-15T10:59:30+05:30 IST
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు కలెక్టరేట్ ప్రాంగణం ముస్తాబైంది. కొవిడ్-19 నిబంధనల మేరకు అతి తక్కువ మందితో జూన్ 2న రాష్ట్ర
నిజామాబాద్ అర్బన్, ఆగస్టు 14: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు కలెక్టరేట్ ప్రాంగణం ముస్తాబైంది. కొవిడ్-19 నిబంధనల మేరకు అతి తక్కువ మందితో జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను నిర్వహించిన విధంగానే ఎలాంటి హడావిడి లేకుండా స్వాతంత్య్రదినోత్సవ వేడుకలను నిర్వహించనున్నారు. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి కలెక్టరేట్ ప్రాంగణంలో శనివారం ఉదయం 10.00 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఉద యం 9 గంటలకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు కలెక్టరేట్లో అధికారు లు అన్ని ఏర్పాట్లు చేశారు.