టీటీడీ చైర్మన్ పదవిని మహిళకు కేటాయించాలి

ABN , First Publish Date - 2021-06-24T02:28:04+05:30 IST

టీటీడీ చైర్మన్ పదవిని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలలోని ఒక మహిళకు కేటాయించి

టీటీడీ చైర్మన్ పదవిని మహిళకు కేటాయించాలి

అమరావతి: టీటీడీ చైర్మన్ పదవిని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలలోని ఒక మహిళకు కేటాయించి తన విశాల దృక్పథాన్ని వైసీపీ చాటుకోవాలని టీడీపీ నాయకురాలు వంగలపూడి అనిత డిమాండ్ చేశారు. మాన్సస్ ట్రస్ట్ నుంచి సంచయిత తొలగింపు అంశాన్ని మహిళా సాధికారతతో ముడిపెట్టడం వాసిరెడ్డి పద్మ అజ్ఞానానికి నిదర్శనమని అనిత విమర్శించారు. ఆమె వ్యాఖ్యలు హైకోర్టు తీర్పును ధిక్కరిస్తున్నట్లుగా ఉన్నాయని అనిత అభిప్రాయపడ్డారు.


దొడ్డిదారిన సంచయితను నియమించారనే విషయం ప్రపంచం మొత్తానికి తెలుసన్నారు. మహిళలకు వైసీపీ ఏ విధమైన న్యాయం చేసిందో తాడేపల్లిలో మహిళపై జరిగిన అత్యాచార ఘటనతోనే తేటతెల్లమైందన్నారు. ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించి నిజమైన మహిళా సాధికారతకు కృషిచేయాలని అనిత కోరారు. 

Updated Date - 2021-06-24T02:28:04+05:30 IST