పిలాయిపల్లి కాల్వపై నిర్లక్ష్యం తగదు
ABN , First Publish Date - 2022-05-21T07:37:02+05:30 IST
పిలాయిపల్లి కాల్వ మరమ్మతులు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ అన్నారు.
భూదాన్ పోచంపల్లి, మే 20: పిలాయిపల్లి కాల్వ మరమ్మతులు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ అన్నారు. శుక్రవారం సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో పిలాయిపల్లి కాల్వ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా నరసింహ మాట్లాడుతూ కొన్ని నెల లుగా కాలువ మరమ్మతులు చేయకుండా అధికారులు స్ధానిక ప్రజా ప్రతినిధులు కాలయాపన చేస్తున్నారు. కాల్వ పనులు చేస్తామని రైతు లను పంటలు వేయనీయకుండా చేసి ఇప్పుడు ఎవరూ పట్టించు కోవ డంలేదన్నారు. పంటలకు నీరు అందించకుంటే సీపీఎం ఆధ్వర్యంలో ఈ జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లా రైతులతో కలిసి పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్ర మంలో మండల కార్యదర్శి లింగారెడ్డి, కార్యదర్శివర్గ సభ్యులు చంద్రా రెడ్డి, విష్ణు, మధు, సత్యనారాయణ రైతులు పాల్గొన్నారు.