కరోనా సోకిందనే భయంతో వ్యక్తి ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-07-10T19:33:51+05:30 IST

కర్నూలులో విషాదం చోటు చేసుకుంది.

కరోనా సోకిందనే భయంతో వ్యక్తి ఆత్మహత్య

కర్నూలు: నగరంలో విషాదం చోటు చేసుకుంది. కేవీఆర్ గార్డెన్స్‌లో నివసించే ఓ వ్యక్తి కరోనా సోకిందనే భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పరీక్ష నివేదిక రాకముందే వైరస్ సోకిందని భావించి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. జాకీర్ హుస్సేన్ అనే వ్యక్తి కొద్ది రోజుల క్రితం కరోనా పరీక్షలు చేయించుకున్నాడు. నెగిటివ్ నిర్ధారణ అయింది. అయితే రిపోర్టు శుక్రవారం వచ్చింది. కానీ గతరాత్రి హుస్సేన్ ఉరి వేసుకున్నాడు. దీంతో కుటుంబసభ్యులు రోధిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2020-07-10T19:33:51+05:30 IST