వ్యక్తి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-01-26T06:51:30+05:30 IST

పరిగి మండలంలోని గొల్లపల్లిలో దూదేకుల బాష(45)అనే వ్యక్తి తన టైలరింగ్‌ షాపు పైకప్పున కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసు కున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపా రు.

వ్యక్తి ఆత్మహత్య
మృతిచెందిన దూదేకుల బాషా (ఫైల్‌)

పరిగి(హిందూపురం టౌన్‌), జనవరి 25 : పరిగి మండలంలోని గొల్లపల్లిలో దూదేకుల బాష(45)అనే వ్యక్తి తన టైలరింగ్‌ షాపు పైకప్పున కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసు కున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపా రు. ఆయన తెలిపిన వివరాల మేర కు.. బాషా భార్యాబిడ్డలు కొంతకాలం గా అతడికి దూరంగా ఉన్నారు. దీని కితోడు ఇటీవల కాలంలో కొన్ని ఆర్థిక ఇబ్బందులతో బాధపడు తున్నాడు. దీంతో మనస్థాపానికి గురై ఆదివారం రాత్రి ఇంటి పైకప్పునకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఉదయం ఎంతసేపటికీ తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చి చుట్టుపక్కలవారు కిటికీ లో తొంగి చూడగా ఫ్యాన్‌కు ఉరివేసుకుని వేలాడుతున్నాడు. పోలీసులకు సమాచారం అందించగా సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.  




లింగారెడ్డిపల్లిలో వృద్ధుడు..

బత్తలపల్లి, జనవరి 25: మండలంలోని లింగారెడ్డిపల్లికి చెందిన ఓబిలేసు(70) ఊరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన మేరకు... లింగారెడ్డిపల్లికి చెందిన ఓబిలేసు భార్య 15 సంవత్సరాల క్రితం మృతి చెందింది. కుమారుడు ఉద్యోగ రీత్యా నెదర్లాండ్‌లో ఉంటున్నాడు. అనారోగ్యానికి గురైన ఓబిలేసు ఒంటరి జీవితాన్ని గడపలేక ఆదివారం రాత్రి మనస్థాపంతో ఇంటి పక్కన ఉన్న చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2021-01-26T06:51:30+05:30 IST