ఆసిఫాబాద్‌ జిల్లాపోలీసుల పనితీరు భేష్‌

ABN , First Publish Date - 2022-10-01T03:27:51+05:30 IST

ఆసిఫాబాద్‌ జిల్లాపోలీసుల పనితీరు భేష్‌గా ఉందని సేవల్లో శభాష్‌ అని డీజీపీ మహేందర్‌రెడ్డి అభినందించారు. శుక్రవారం హైదరాబాద్‌ నుంచి నేరాలనియంత్రణ పోలీసుల దర్యాప్తు, ఫంక్షన్‌ వర్టికల్స్‌పై జిల్లాల పోలీసు ఉన్న తాధికారులతో డీజీపీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు భద్రత విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.

ఆసిఫాబాద్‌ జిల్లాపోలీసుల పనితీరు భేష్‌
వీసీలో పాల్గొన్న ఎస్పీ సురేష్‌కుమార్‌, పోలీసు అధికారులు

- వీసీలో డీజీపీ మహేందర్‌రెడ్డి

ఆసిఫాబాద్‌, సెప్టెంబరు 30:  ఆసిఫాబాద్‌ జిల్లాపోలీసుల పనితీరు భేష్‌గా ఉందని సేవల్లో శభాష్‌ అని డీజీపీ మహేందర్‌రెడ్డి అభినందించారు. శుక్రవారం హైదరాబాద్‌ నుంచి నేరాలనియంత్రణ పోలీసుల దర్యాప్తు, ఫంక్షన్‌ వర్టికల్స్‌పై జిల్లాల పోలీసు ఉన్న తాధికారులతో డీజీపీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు భద్రత విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. జూలై నెలలో స్టేషన్‌హౌస్‌ ఆఫీసర్‌ ఫంక్షన్‌వర్టికల్‌, కమ్యూనిటీ పోలీసింగ్‌ ఫంక్షన్‌వర్టికల్‌లో కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాటాప్‌లో నిలిచిందన్నారు. నిషేదిత మత్తుపదార్థాల విషయంలో ప్రత్యేక దృష్టి కనబర్చాలని తెలిపారు. కేసుల విషయంలో నాణ్యత ప్రమాణాలు పాటిం చాలని పేర్కొన్నారు. సీసీకెమెరాల ఏర్పాటు వాటిఆవశ్యకత గురించి వ్యాపారస్తులకు, పట్టణ వాసులకు తెలియజేయాలన్నారు. సైబర్‌ నేరాలపై ప్రజలకు నిత్యం అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. ఏఎస్పీలు అచ్చేశ్వర్‌రావు, భీంరావు, డీఎస్పీలు శ్రీనివాస్‌, కరుణాకర్‌,నాగేందర్‌,సీఐలు,ఎస్సైలు,ఐటీకోర్‌సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-01T03:27:51+05:30 IST