పోరాటానికిదే సరైన సమయం

ABN , First Publish Date - 2022-01-25T08:42:25+05:30 IST

హక్కుల సాధన కోసం పోరాడేందుకు ఇదే సరైన సమయమని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు.

పోరాటానికిదే సరైన సమయం

లేదంటే భవిష్యత్తులో ఎక్కువ నష్టపోయే ప్రమాదం: వెంకట్రామిరెడ్డి

అమరావతి, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): హక్కుల సాధన కోసం పోరాడేందుకు ఇదే సరైన సమయమని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో వచ్చేనెల 7 నుంచి సమ్మెకు వెళ్లనుండడంతో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకైనా సచివాలయ ఉద్యోగులు సిద్ధంగా ఉండాలన్నారు. సోమవారం అమరావతి సచివాలయంలో ఉద్యోగుల సంఘం జనరల్‌బాడీ సమావేశం జరిగింది. పీఆర్సీ సాధనకు, ఉద్యమ కార్యాచరణకు సమావేశం ఏకగ్రీవ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. న్యాయమైన హ క్కుల సాధన కోసం ఇప్పుడు గట్టిగా పోరాడకపోతే ఉద్యోగులు భవిష్యత్తులో మరింత నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. 

Updated Date - 2022-01-25T08:42:25+05:30 IST