వైసీపీ రౌడీ పాలనకు ప్రజలే బుద్ధి చెబుతారు
ABN , First Publish Date - 2021-10-23T06:16:13+05:30 IST
రాష్ట్రంలో వైసీపీ సాగిస్తున్న రౌడీ పాలనకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని తెలుగు మహిళా నాయకురాలు. సింగనమల మాజీ జడ్పీటీసీ శాలిని దొర పేర్కొన్నారు.
అనంతపురం వైద్యం, అక్టోబరు 22: రాష్ట్రంలో వైసీపీ సాగిస్తున్న రౌడీ పాలనకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని తెలుగు మహిళా నాయకురాలు. సింగనమల మాజీ జడ్పీటీసీ శాలిని దొర పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో ఆమె శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. వైసీ పీ తమ అసమర్థత, ప్రజా వ్యతిరేక విధానాల నుంచి ప్రజలను తప్పుదావ పట్టించేందుకు... ప్రశ్ని స్తున్న టీడీపీ నాయకులపై దాడులకు దిగుతోందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి రా జకీయ అనుభవం ఉన్నంత వయసు లేని వారు కూడా నోటికొచ్చినట్లు మాట్లాడడం చూస్తుంటే అసహ్యం కలుగుతోందన్నారు. కేవలం సీఎం జగన మెప్పు పొంది పదవులు కాపాడుకోవాలని భజనలు చేస్తున్నారని వైసీపీ నిరసనలపై శాలిని విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్యం ఎప్పటికైనా గెలుస్తుందని అప్పుడు వైసీపీ గూండాలు సరైన గుణపాఠం నేర్చుకుంటారని హెచ్చరించారు.