విశాఖ ప్రజలను మరింతగా అప్రమత్తం చేయాలి
ABN , First Publish Date - 2021-05-06T04:18:00+05:30 IST
కొవిడ్ విస్తృతిపై విశాఖ ప్రజలను మరింత అప్రమత్తం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బండారు అప్పలనాయుడు డిమాండ్ చేశారు. బుధవారం విలేఖరులతో మాట్లాడుతూ సీసీఎంబీ శాస్త్రవేత్తలు విశాఖ, కర్నూలులో కొత్తరకం వైరస్ కనుగొన్నారని, దానికి ఎన్440కె ఏపీ వారియంట్గా నామకరణం చేశారని పేర్కొన్నారు.
టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బండారు అప్పలనాయుడు
పరవాడ, మే 5: కొవిడ్ విస్తృతిపై విశాఖ ప్రజలను మరింత అప్రమత్తం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బండారు అప్పలనాయుడు డిమాండ్ చేశారు. బుధవారం విలేఖరులతో మాట్లాడుతూ సీసీఎంబీ శాస్త్రవేత్తలు విశాఖ, కర్నూలులో కొత్తరకం వైరస్ కనుగొన్నారని, దానికి ఎన్440కె ఏపీ వారియంట్గా నామకరణం చేశారని పేర్కొన్నారు. ఇది కోవిడ్ వైరస్ కంటే 15 రెట్లు అధిక ప్రభావం చూపుతుందని, ఈ అంశం పత్రికల్లోనూ వచ్చిందన్నారు. దీనిపై ఇంత వరకు ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. ప్రజలకు కొత్తరకం వైరస్ పట్ల అవగాహన కల్పించాలన్నారు. వెంటనే విశాఖలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి, ప్రతి ఒక్కరికీ టీకాలు వేయించాలన్నారు.