ఖమ్మం ప్రజలు ఎవరి ఉచ్చులో పడరు
ABN , First Publish Date - 2021-03-19T16:54:43+05:30 IST
ఖమ్మం ప్రజలు ఎవరి ఉచ్చులో పడరని మంత్రి పువ్వాడ అజయ్
ఖమ్మం: ఖమ్మం ప్రజలు ఎవరి ఉచ్చులో పడరని మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. తెలంగాణలో షర్మిల కొత్త పార్టీ పెట్టనున్నారు. దీంతో తమకు పట్టు ఉన్న ఈ జిల్లాపై షర్మిల ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు. ఈ నేపథ్యంలో షర్మిల కొత్త పార్టీ పై మంత్రి అజయ్ స్పందించారు. ఖమ్మం ప్రజలు అన్ని రాజ్యాలు చూసే కేసీఆర్ వైపు మళ్లారని మంత్రి అజయ్ పేర్కొన్నారు.
2014 ఎన్నికలలో ఖమ్మం లోక్సభ స్థానాన్ని వైసీపీ గెలుచుకుంది. ఆ పార్టీ తరపున పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎంపీగా గెలిచారు. అలాగే నాలుగు అసెంబ్లీ సీట్లను వైసీపీ గెలుచుకుంది. అనంతరం జరిగిన పరిణామాల్లో వారందరు టీఆర్ఎస్లో చేరారు. తమకు పట్టు ఉన్న ఈ జిల్లాపై తిరిగి జెండా ఎగుర వేయాలని షర్మిల భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జిల్లాలోని ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయాలని షర్మిల భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.