రైతుల ఉసురు తగులుతుంది
ABN , First Publish Date - 2021-07-26T05:01:19+05:30 IST
రైతులను అన్ని విధాలుగా మోసం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వా నికి వారి ఉసురు తగులుతుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకటరావు అన్నారు.
టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకటరావు
రణస్థలం/లావేరు: రైతులను అన్ని విధాలుగా మోసం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వా నికి వారి ఉసురు తగులుతుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకటరావు అన్నారు. ఆదివారం తిరుపతిపాలెం, సంచాం, కమ్మసిగడాం గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ... తోటపల్లి కాలువలు చాలావరకు అసంపూర్తిగా మిగిలిపోయాయని, వాటిని పూర్తి చేయాలన్నారు. ప్రస్తుతం దేవరాపల్లి వరకు తోటపల్లి నుంచి సాగునీరు రావడం సంతోషమని, సం బంధిత అధికారులు అభినందనలు తెలిపారు. రైతుల నుంచి సేకరించి పంటకు నేటికీ డబ్బులు చెల్లించలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని దుయ్య బట్టారు. ప్రతి కార్యకర్త టీడీపీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో పిసిని జగన్నాథంనాయుడు, కోరాడ వెంకటరమణ, బొట్ల రాంబాబు, రౌతు శ్రీనివాస్, దుమ్మ అశోక్ తదితరులు పాల్గొన్నారు. లావేరు మండలంలోని గురుగుబిల్లి, రావివలస, తాళ్లవలస, కొత్తకోట, సుఽభద్రాపురం, అదపాక, గోవిందపురం గ్రామాల్లో టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంకటరావు పర్యటించారు. ఇటీవల మృతి చెందిన బాధితుల కుంటుంబాలను పరామర్శించారు. టీడీపీ నాయకులు ముప్పిడి సురేష్, పిన్నింటి మధుబాబు, ఐతోటయ్యదొర తదితరులు ఉన్నారు.
టీడీపీ పాలకొండ మండలాధ్యక్షుడిగా రామినాయుడు
పాలకొండ: టీడీపీ మండలాధ్యక్షుడిగా గండి రామినాయుడును ఎన్నికయ్యారు. ఆదివారం పట్టణంలో పాలకొండ నియో జకవర్గ ఇన్చార్జి నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యం లో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. ఫ టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు కళా వెం కటరావును పార్టీ పాలకొండ నియోజకవర్గ ఇన్చార్జి నిమ్మక జయకృష్ణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్నేన అప్పలనాయుడు, కిమిడి కాశింనా యుడు, సత్యంనాయుడు, వరహా లనాయుడు ఆదివారం కలిశారు. ఈ సందర్భంగా పార్టీ పాలకొండ మండలాధ్యక్షు డిగా నియమితులైన బండి రామినాయుడును కళా వెంకటరావు అభినందించారు.