మహాత్మాగాంధీ మార్గం అనుసరణీయం : కుంభం
ABN , First Publish Date - 2022-01-21T06:19:38+05:30 IST
నేటి యువత మహాత్మాగాంధీ చూపిన మార్గాన్ని అనుసరించాలని డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్కుమార్రెడ్డి అన్నారు. గాంఽధీ గ్లోబల్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో రూపొందించిన డైరీ, క్యాలెండర్ను గురువారం ఆవిష్కరించారు. గాంఽధీజీ శాంతి సందేశాలను, అహింసా మార్గాలను పలువురు నాయకులు ఆదర్శంగా తీసుకొని దేశ స్వా తంత్య్ర పోరాటంలో పాల్గొ
వలిగొండ, జనవరి 20: నేటి యువత మహాత్మాగాంధీ చూపిన మార్గాన్ని అనుసరించాలని డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్కుమార్రెడ్డి అన్నారు. గాంఽధీ గ్లోబల్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో రూపొందించిన డైరీ, క్యాలెండర్ను గురువారం ఆవిష్కరించారు. గాంఽధీజీ శాంతి సందేశాలను, అహింసా మార్గాలను పలువురు నాయకులు ఆదర్శంగా తీసుకొని దేశ స్వా తంత్య్ర పోరాటంలో పాల్గొని విజయం సాధించారని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ బోళ్ల లలితా శ్రీనివాస్, గాంధీ గ్లోబల్ రాష్ట్ర ఆర్గనైజర్ మెరుగు మధు, అధ్యక్షుడు పాలకూర్ల వెంకటేశం, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పాశం సత్తిరెడ్డి, కంకల కిష్టయ్య, గరిసె రవి, కాసుల వెంక టేశం, బత్తిని సహదేవ్, పబ్బు సురేందర్, రేగు శ్రీనివాస్, వరుణ్కుమార్, ప్రవీణ్, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.