బాల్క సుమన్‌ నియామకంతో పార్టీ బలోపేతం

ABN , First Publish Date - 2022-01-27T05:41:10+05:30 IST

మంచిర్యాల జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడిగా ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ నియామకంతో జిల్లాలో పార్టీ మరింత బలపడుతుందని అఖిల భారత యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు బండి సదానందం యాదవ్‌ అన్నారు.

బాల్క సుమన్‌ నియామకంతో పార్టీ బలోపేతం
మాట్లాడుతున్న బండి సదానందం యాదవ్‌

-అఖిల భారత యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు బండి సదానందం యాదవ్‌

మందమర్రిటౌన్‌, జనవరి 26 : మంచిర్యాల జిల్లా  టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడిగా ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ నియామకంతో జిల్లాలో పార్టీ మరింత బలపడుతుందని అఖిల భారత యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు బండి సదానందం యాదవ్‌ అన్నారు. మందమర్రిలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి 33 జిల్లాలకు అధ్యక్షులను నియమించడం శుభ పరిణామమన్నారు. చెన్నూరు  నియోజకవర్గాన్ని అన్ని రంగాలుగా అభివృద్ధి చేయడంతో పాటు జిల్లా అభివృద్ధికి పాటు పడుతున్న ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు పదవీ రావడం ఆనందంగా ఉందని తెలిపారు. కష్టపడే వారికి పదవులు వస్తున్నాయని, ఇది ఎంతో సంతోషకరమని చెప్పారు. అన్ని విషయాల పట్ల అవగాహన ఉండడంతో పాటు అభివృద్ధికి కృషి చేస్తున్న గొప్ప నాయకుడు సుమన్‌ అని కొనియాడారు. త్వరలో యాదవ సంఘం సమావేశం ఏర్పాటు చేసి సుమన్‌ను ఆహ్వానించనున్నట్లు తెలిపారు.  సమావేవఃలో యాదవ సంఘం నాయకులు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-27T05:41:10+05:30 IST