ప్రజల పక్షపాతి కమ్యూనిస్టులే
ABN , First Publish Date - 2021-07-25T04:48:04+05:30 IST
నిబద్దతతో పనిచేస్తూ, నిజమైన ప్రజలపక్షపాతి కమ్యూనిస్టులేనని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు బి.నారాయణ పేర్కొన్నారు.
బద్వేలు,జూలై 24: నిబద్దతతో పనిచేస్తూ, నిజమైన ప్రజలపక్షపాతి కమ్యూనిస్టులేనని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు బి.నారాయణ పేర్కొన్నారు. ఏవీఆర్ పాఠశాలలో సీపీఎం జిల్లా రాజకీయ ప్రాంతీయ శిక్షణా తరగతులు రెండో రోజు చేరుకున్నాయి. శిక్షణలో ఆయన మాట్లాడుతూ సీపీఎం కార్యకర్తలు ప్రజలను అంటిపెట్టుకుని ప్రజల సమస్యలపై స్పందిస్తూ ప్రజలకష్టాలు తీరేవరకు ఉద్యమాలు, పోరాటాలు నిర్వహిస్తుంటారన్నారు.
బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ జపం చేస్తోందని రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం విజన్ లేకుండా వివాదాస్పదంగా నడుస్తోందని ఆయన విమర్శించారు. కృష్ణా నీటి సమస్యపై కేంద్రం జోక్యంతో మరింత వివాదమయ్యే పరిస్థితులు వచ్చాయన్నారు. ఇప్పటికైనా అఖిలపక్ష కమిటీని ఏర్పాటు చేసి నీటి పారుదల నిపుణులతో చర్చించి ముందుకు పోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో సీపీఎం పట్టణ కార్యదర్శి కె.శ్రీనివాసులు, కమిటీ సభ్యులు నాయబ్ రసూల్, మస్తాన్, సుబ్బరాయుడు, తదితరులు పాల్గొన్నారు.