పార్టీలకతీతంగా కలిసి పని చేయాలి

ABN , First Publish Date - 2021-05-14T05:52:57+05:30 IST

కరోనా మహమ్మారి పట్టణాల నుంచి ఇప్పు డు గ్రామాల్లో ప్రతాపాన్ని చూపుతుందని, ఈ సమయంలో మండల, గ్రామస్థాయి నాయకులు పార్టీలకతీతంగా కలిసి పని చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయలశంకర్‌ పిలుపునిచ్చారు. గురువారం ఉదయం జూమ్‌ ద్వారా క్షేత్రస్థాయి నాయకులతో మాట్లాడారు. గ్రామాల్లోని వార్డు ల్లోని పాఠశాల భవనాలను ఐసోలేషన్‌ సెంటర్లుగా మార్చాలన్నారు. గ్రా మాల్లో చాలా వరకు ఉమ్మడి కుటుంబాలు ఉంటాయని తెలిపారు. కరో నా సోకిన వారితో భౌతికదూరం కష్టం కారణంగా ఆ కుటుంబంలోని మిగితా వారికి వ్యాధి సోకే ప్రమాదం ఉన్నందున ఈ ఐసోలేషన్‌ సెంట ర్లు ఉపయోగపడుతాయన్నారు.

పార్టీలకతీతంగా కలిసి పని చేయాలి

ఆదిలాబాద్‌అర్బన్‌, మే13: కరోనా మహమ్మారి పట్టణాల నుంచి ఇప్పు డు గ్రామాల్లో ప్రతాపాన్ని చూపుతుందని, ఈ సమయంలో మండల, గ్రామస్థాయి నాయకులు పార్టీలకతీతంగా కలిసి పని చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయలశంకర్‌ పిలుపునిచ్చారు. గురువారం ఉదయం జూమ్‌ ద్వారా క్షేత్రస్థాయి నాయకులతో మాట్లాడారు. గ్రామాల్లోని వార్డు ల్లోని పాఠశాల భవనాలను ఐసోలేషన్‌ సెంటర్లుగా మార్చాలన్నారు. గ్రా మాల్లో చాలా వరకు ఉమ్మడి కుటుంబాలు ఉంటాయని తెలిపారు. కరో నా సోకిన వారితో భౌతికదూరం కష్టం కారణంగా ఆ కుటుంబంలోని మిగితా వారికి వ్యాధి సోకే ప్రమాదం ఉన్నందున ఈ ఐసోలేషన్‌ సెంట ర్లు ఉపయోగపడుతాయన్నారు. వ్యాధి సోకిన వారికి మనోధైర్యం, పౌష్టి కాహారం అందించాలన్నారు. ఎవరికైనా రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు అవసర మైతే వైద్యుల ప్రిస్కిప్షన్‌పై హైదరాబాద్‌ నుంచి ఎంఆర్‌పీ ధరకే తెప్పిం చుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-14T05:52:57+05:30 IST