జోరుగా ‘మొబైల్’ ప్రచారం!
ABN , First Publish Date - 2021-03-08T07:59:00+05:30 IST
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు ‘మొబైల్’ ప్రచారం చేస్తున్నారు.
ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి పార్టీల ప్రయత్నం
హైదరాబాద్, మార్చి 7(ఆంధ్రజ్యోతి): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు ‘మొబైల్’ ప్రచారం చేస్తున్నారు. ప్రతి ఓటరును కలిసే అవకాశం లేకపోవడంతో.. మొబైల్ ఫోన్లకు సందేశాలు పంపుతూ ప్రసన్నం చేసుకుంటున్నారు. కొందరు అభ్యర్థులైతే ఓటర్ స్లిప్నే వాట్సా్పలో ఓటర్లకు పంపిస్తుండటం గమనార్హం. అందులో ఓటుకు సంబంధించిన పూర్తి వివరాలు ఉంటున్నాయి. సందేశంతో పాటు ఒక లింక్ను పంపుతున్నారు. దానిని క్లిక్ చేయగానే.. అభ్యర్థుల వివరాలు, వారు చేసిన పనులతో కూడిన వివరాలతో ఉండే విండో ఓపెన్ అవుతుంది. సోషల్మీడియాలో ఇప్పటికే విరివిగా ప్రచారం చేస్తున్న అభ్యర్థులు.. సందేశాలు పంపుతూ ‘మొబైల్’ ప్రచారానికి తెర లేపారు.