చెరువులో పడి వృద్ధురాలి మృతి

ABN , First Publish Date - 2021-04-16T05:26:29+05:30 IST

చెరువులో పడి వృద్ధురాలు మృతి చెందిన సంఘటన గురువారం దౌల్తాబాద్‌ మండలం సూరంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.

చెరువులో పడి వృద్ధురాలి మృతి

రాయపోల్‌, ఏప్రిల్‌ 15: చెరువులో పడి వృద్ధురాలు మృతి చెందిన సంఘటన గురువారం దౌల్తాబాద్‌ మండలం సూరంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సూరంపల్లికి చెందిన దోమలు లక్ష్మి(70) గురువారం ఉదయం దుస్తులను ఉతుక్కోవడానికి స్థానికంగా ఉన్న చెరువు వద్దకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబీకులు వెళ్లి చూడగా చెరువులో మృతదేహమై కనిపించింది. కొడుకు భిక్షపతి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


 

Updated Date - 2021-04-16T05:26:29+05:30 IST