చికిత్సపొందుతూ వృద్ధురాలు మృతి

ABN , First Publish Date - 2022-08-11T06:27:27+05:30 IST

పురుగు మందు తాగి ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధురాలు బుధవారం మృతి చెందింది.

చికిత్సపొందుతూ వృద్ధురాలు మృతి
ఆవని మృతదేహం

మిర్యాలగూడ అర్బన, ఆగస్టు 10:  పురుగు మందు తాగి ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధురాలు బుధవారం మృతి చెందింది. టూటౌన సీఐ నిగిడాల సురేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. దేవరకొండ డివిజనకు చెందిన ఆవని (60) మంగళవారం రాత్రి హాలియాలో ఆర్టీసీ బ స్సు ఎక్కి మిర్యాలగూడకు చేరుకుంది. బస్సు ది గుతూ సొమ్మసిల్లిపడిపోయున వృద్ధురాలిని ప్ర యాణికులు గుర్తించి సపర్యలు చేశారు. అమె నోట్లో నుంచి పురుగు మందు వాసన రావడంతో ఆత్మహత్యాయత్నం చేసినట్లుగా గుర్తించి 108కు ఫోనచేశారు. చికిత్స నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తుండగా బుధవారం పరిస్థితి విషమించి మృతి చెందింది.  తనది దేవరకొండ కాగా తన భర్తపేరు రాములు అని వృద్ధురాలు చెప్పినట్లు సీఐ తెలిపారు. మృతదేహాన్ని మార్చురీగదిలో భద్రపరిచి వృద్ధురాలి వివరాలు తెలుసుకునే ప్రయ త్నం చేస్తున్నామన్నారు.


Updated Date - 2022-08-11T06:27:27+05:30 IST