పాత పీఆర్సీ అమలు చేయాలి: వినుకొండ
ABN , First Publish Date - 2022-01-25T08:43:58+05:30 IST
పాత పీఆర్సీని యఽథాతథంగా అమలు చేయాలని ఏపీ ప్రభుత్వ రిజిస్టర్డ్ ఉద్యోగుల సంఘాల జేఏసీ చైర్మన్ వినుకొండ రాజారావు అన్నారు.
విజయవాడ వన్ టౌన్, జనవరి 24: పాత పీఆర్సీని యఽథాతథంగా అమలు చేయాలని ఏపీ ప్రభుత్వ రిజిస్టర్డ్ ఉద్యోగుల సంఘాల జేఏసీ చైర్మన్ వినుకొండ రాజారావు అన్నారు. ఈమేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కొత్త పీఆర్సీ వల్ల ప్రభుత్వానికి ఏడాదికి రూ.10,800 కోట్లు మాత్రమే వ్యయమవుతుందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగున్నపుడే కొత్త పీఆర్సీ తీసుకుంటామని, అప్పటిదాకా పాత పీఆర్సీనే అమలు చేయాలని ఉద్యోగులు కోరుకుంటున్నారని తెలిపారు. పాత పీఆర్సీనే అమలు చేయాలంటూ ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారని, దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలని వినుకొండ అన్నారు.