బైక్పై నుంచి పడి వృద్ధుడి మృతి
ABN , First Publish Date - 2022-06-28T06:21:16+05:30 IST
పెద్దపప్పూ రు మండలంలోని రెడ్డిపల్లి గ్రామస మీపంలో ద్విచక్రవాహనం నుంచి కిందపడి ఓబులేసు (60) మృతిచెందాడని ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.
తాడిపత్రిటౌన్, జూన్ 27: పెద్దపప్పూ రు మండలంలోని రెడ్డిపల్లి గ్రామస మీపంలో ద్విచక్రవాహనం నుంచి కిందపడి ఓబులేసు (60) మృతిచెందాడని ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాలమేరకు మండలకేంద్రానికి చెందిన ఓబులేసు గ్రామాల్లో వాము వాటర్ అమ్ము తూ జీవనం సాగించేవాడు. కొంతకా లంగా అనారోగ్యం బారినపడి బాధపడుతుండేవాడు. వ్యాపారం నిమిత్తం రెడ్డిపల్లికి వెళ్లే క్రమంలో రహదారిలో ఉన్నట్టుండి ద్విచక్రవాహనం నుంచి కిందపడి అక్కడి కక్కడే మృతిచెందాడు. మృతునికి భార్య వెంకటలక్షుమ్మతోపాటు నలుగురు కుమా రులు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నా మని ఎస్ఐ తెలిపారు.