కూలీల సంఖ్య పెంచాలి

ABN , First Publish Date - 2022-05-24T05:45:30+05:30 IST

కూలీల సంఖ్య పెంచాలి

కూలీల సంఖ్య పెంచాలి

చేవెళ్ల, మే 23: గ్రామాల్లో ఉపాధి హమీపథకం పనుల్లో కూలీల సంఖ్య పెంచాలని జిల్లా డీఆర్‌డీఏ పీడీ ప్రభాకర్‌ అధికారులను ఆదేశించారు. చేవెళ్ల మండలంలోని ఆలూర్‌ గ్రామంలో ఉన్న పల్లెప్రకృతి వనాన్ని సోమవారం పరిశీలించారు. అదేవిధంగా నూతనంగా ఏర్పాటు చేస్తున్న తెలంగాణ క్రీడా మైదానాల స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకం పనుల్లో కూలీల సంఖ్య పెంచాలన్నారు. క్రీడాప్రాంగణానికి ఆలూర్‌ గ్రామంలోని ఎకరం ప్రభుత్వ భూమిని పరిశీలించి ఎంపిక చేసినట్లు తెలిపారు. రూ.3లక్షలతో క్రీడామైదానం నిర్మిస్తున్నట్లు తెలిపారు. పల్లెప్రకృతిలో మొక్కలను బాగా పెంచాలన్నారు. కార్యక్రమంలో చేవెళ్ల ఇన్‌చార్జి ఎంపీడీవో రాజ్‌కుమార్‌, ఈసీ రాజశేఖర్‌,  సిబ్బంది ఉన్నారు. 

Updated Date - 2022-05-24T05:45:30+05:30 IST