కరోనా బాధితుల కోసం సేవా విభాగాన్ని ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ ట్రస్ట్
ABN , First Publish Date - 2021-05-13T00:38:18+05:30 IST
కరోనా బాధితులకు అండగా ఎన్టీఆర్ ట్రస్టు అత్యవసర సేవా విభాగాన్ని ఏర్పాటు చేసింది. కరోనా
హైదరాబాద్/ అమరావతి : కరోనా బాధితులకు అండగా ఎన్టీఆర్ ట్రస్టు అత్యవసర సేవా విభాగాన్ని ఏర్పాటు చేసింది. కరోనా బాధితులకు వైద్య సలహా నిమిత్తమై ఆన్లైన్ డాక్టర్ కన్సల్టేషన్ను ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకూ 592 మంది సహాయం అడగ్గా, 351 సమస్యలు పరిష్కారమయ్యాయని ట్రస్టు ఓ ప్రకటనలో పేర్కొంది. అమెరికా వైద్యులతో ఆన్లైన్ మెడికల్ కన్సల్టేషన్ ఇప్పిస్తున్నామని, ఇప్పటి వరకు 320 మంది కరోనా బాధితులకు ఆన్లైన్ సలహాలు ఇచ్చినట్లు ట్రస్టు పేర్కొంది. 185 మంది కరోనా నుంచి కోలుకునేలా సూచనలు చేశామని, మందులు కూడా అందించామని ప్రతినిధులు తెలిపారు. కరోనాతో ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోకూడదన్నదే తమ ట్రస్టు అభిమతమని స్పష్టం చేసింది. కరోనా బాధితులకు ప్రభుత్వ వ్యవస్థలు భరోసా ఇవ్వలేకపోతున్నాయని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏ ఒక్కరూ ఆస్పత్రిలో చేరకుండానే కోలుకునేలా సూచనలు చేస్తున్నామని ఎన్టీఆర్ ట్రస్టు ఓ ప్రకటనలో తెలిపింది.