రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే : ఎంపీ సోయం

ABN , First Publish Date - 2022-01-23T05:44:15+05:30 IST

ఆదివాసీ గిరిజనుల అభివృది కేంద్ర ప్రభుత్వ చొరవతోనే సాధ్యమని, రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ఎంపీ సోయంబాపురావు వెల్లడించారు.

రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే : ఎంపీ సోయం


ఇంద్రవెల్లి, జనవరి 22:
ఆదివాసీ గిరిజనుల అభివృది కేంద్ర ప్రభుత్వ చొరవతోనే సాధ్యమని, రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ఎంపీ సోయంబాపురావు వెల్లడించారు. శనివారం మండలంలోని తుమ్మగూడ, హీరాపూర్‌తో పాటు పలు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం చేపట్టిన మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమంతో ఆదివాసీ గిరిజనులకు మౌలిక వసతుల కల్పనకు ఆ  బృందం ఆదివాసీ గ్రామాల్లో పర్యటించి, గిరిజనుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీఎంపీ రాథోడ్‌ రమేష్‌, జడ్పీటీసీ అర్క పుష్పలత, మేక్‌ ఇన్‌ ఇండియా ప్రతినిధులు సుధాకర్‌, శంకర్‌, వైస్‌ ఎంపీపీ పడ్వాల్‌ గోపాల్‌సింగ్‌, మండలాధ్యక్షుడు ఆరేల్లి రాజలింగు, ఎంపీటీసీ మడావి భీంరావ్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-23T05:44:15+05:30 IST