ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు.. అనంతరం ఆ కార్యక్రమాన్ని వాయిదా వేశారు.. తద్వారా కోటీశ్వరులయ్యారు..!

ABN , First Publish Date - 2021-10-14T02:26:03+05:30 IST

పెళ్లైన కొత్త జంటను అదృష్టం వరించింది. పెళ్లి తర్వాత జరిగే కార్యక్రమాన్ని ఆ జంట వాయిదా వేసుకుంది. అనంతరం వారు చేసిన పని వల్ల కోట్లు వచ్చిపడ్డాయి. దీంతో వారి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.

ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు.. అనంతరం ఆ కార్యక్రమాన్ని వాయిదా వేశారు.. తద్వారా కోటీశ్వరులయ్యారు..!

కొన్నింటిని త్యాగం చేయడం ద్వారా.. కొందరికి మరో రూపంలో అదృష్టం వరిస్తూ ఉంటుంది. త్యాగం చేయడం మంచికే జరిగిందని తర్వాత తెలుసుకుంటారు. ఇలాగే ఓ పెళ్లైన కొత్త జంటను అదృష్టం వరించింది. పెళ్లి తర్వాత జరిగే కార్యక్రమాన్ని ఆ జంట వాయిదా వేసుకుంది. అనంతరం వారు చేసిన పని వల్ల కోట్లు వచ్చిపడ్డాయి. దీంతో వారి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. తన జీవితంలోకి భార్య రావడంతో అదృష్టం కలిసొచ్చిందని ఆ భర్త మురిసిపోయాడు. అమెరికాలోని లెక్సింగ్‌టన్‌లో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. 


నార్త్ కరోలినాకు చెందిన 60 ఏళ్ల మైఖేల్ ఎబెర్నెతి.. ఇటీవలే వివాహం చేసున్నారు. అనంతరం హనీమూన్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే సడన్‌గా నిర్ణయాన్ని మార్చుకున్నారు. హనీమూన్‌కు వెళ్లే కంటే.. ఆ డబ్బులతో ఏదైనా కొత్తగా ట్రై చేయాలని భావించారు. సమీపంలోని ఓ స్టోర్‌కు వెళ్లి లాటరీ టికెట్ తీసుకున్నారు. మొదటగా 30 డాలర్లు గెలుచుకున్నారు. ఆ మొత్తంతో మరో రెండు టికెట్లు కొనుగోలు చేశారు. అందులో ఒక టికెట్ నిరాశ పరచగా.. రెండో టికెట్ ద్వారా అదృష్టం వరించింది. ఆ టికెట్ ద్వారా వారు 1 మిలియన్ డాలర్లు.. (రూ.7.5 కోట్లు) గెలుపొందారు. దీంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.


ఒక్కసారిగా కోట్లు వచ్చిపడడంతో వారి జీవితాన్ని అందంగా మలుచుకున్నారు. అలాగే వారు వాయిదా వేసిన హనీమూన్ కార్యక్రమాన్ని కూడా కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు. ఫ్లోరిడాలో హనీమూన్‌ ట్రిప్ ఎంజాయ్ చేయనున్నట్లు తెలిపారు. మిగిలిన డబ్బులను భవిష్యత్ అవసరాల కోసం వినియోగించనున్నట్లు ఆ జంట చెబుతోంది. ఈ విషయం తెలిసిన వారంతా.. అదృష్టం ఎప్పుడు, ఏ రూపంలో వరిస్తుందో చెప్పలేమంటూ చర్చించుకుంటున్నారు.

Updated Date - 2021-10-14T02:26:03+05:30 IST