రూ.150 లక్షల కోట్లు
ABN , First Publish Date - 2021-04-11T06:10:12+05:30 IST
దేశంలోని బ్యాంకుల డిపాజిట్లు సరికొత్త రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఆర్బీఐ తాజా డేటా ప్రకారం.. గతనెల 26 నాటికి దేశంలోని అన్ని బ్యాంకుల్లో జమ అయిన నగదు డిపాజిట్ల విలువ రూ.151.13 లక్షల కోట్లకు చేరుకుంది
బ్యాంక్ డిపాజిట్లలో సరికొత్త రికార్డు
ముంబై: దేశంలోని బ్యాంకుల డిపాజిట్లు సరికొత్త రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఆర్బీఐ తాజా డేటా ప్రకారం.. గతనెల 26 నాటికి దేశంలోని అన్ని బ్యాంకుల్లో జమ అయిన నగదు డిపాజిట్ల విలువ రూ.151.13 లక్షల కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే డిపాజిట్లు 11.3 శా తం వృద్ధి చెందాయి. 2011 ఫిబ్రవరిలో దేశంలోని బ్యాంకుల మొత్తం డిపాజిట్లు రూ.50 లక్షల కోట్లు స్థాయికి చేరగా.. 2016 సెప్టెంబరులో రూ.100 లక్షల కోట్లకు పెరిగాయి.