నూతన వ్యవసాయ బిల్లులు దారుణం
ABN , First Publish Date - 2020-10-15T07:01:16+05:30 IST
మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇటీవల తెచ్చిన వ్యవసాయ బిల్లులు అత్యంత దారుణమని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు
నేలకొండపల్లి,అక్టోబరు14: మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇటీవల తెచ్చిన వ్యవసాయ బిల్లులు అత్యంత దారుణమని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ విమర్శించారు. బుధవారం మండలంలోని నేలకొండపల్లి, రాజేశ్వరపురం తదితర గ్రామాల్లో దుర్గాప్రసాద్ పర్యటించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నీట మునిగిన వరి పొలాలను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో నేలకొండపల్లి సర్పంచ్ రాయపూడి నవీన్ ఎంపీటీసీ బొడ్డు బొందయ్య, ఉప సర్పంచ్ లక్కం ఏడుకొండలు, షేక్.హుస్సేన్, చిట్యాల రమేష్, దండా సత్యనారాయణ, గుడిబోయిన వెంకటేశ్వర్లు, తోట వెంకటేశ్వర్లు, దాసరి దానియేల్, కుక్కల హనుమంతరావు, బచ్చలకూరి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.