నిత్యం రెప రెపలాడనున్న జాతీయ జెండా
ABN , First Publish Date - 2022-08-16T07:05:36+05:30 IST
జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తాలో ఇకపై జాతీయ జెండా నిత్యం రెప రెపలాడనుంది.
జమ్మికుంట, ఆగస్టు 15: జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తాలో ఇకపై జాతీయ జెండా నిత్యం రెప రెపలాడనుంది. 66ఫీట్ల ఎత్తు జెండాకు 20ఫీట్ల వెడల్పు, 12ఫీట్ల ఎత్తు గల త్రివర్ణ పతాకం ఏర్పాటు చేయగా, ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్రావు స్విచ్చు నొక్కి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ నిత్యం జాతీయ గీతం ఆలాపిస్తూ అన్ని ప్రాంతాల వారికి ఆదర్సంగా నిలిచిన జమ్మికుంటలో ఇకపై నిత్యం జాతీయ జెండా ఎగురడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దేశీని స్వప్న-కోటి, జెడ్పీటీసీ డాక్టర్ శ్రీరామ్ శ్యామ్, పట్టణ సీఐ కె రామ్చందర్రావు, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.