డిగ్రీ కళాశాలను పరిశీలించిన న్యాక్‌ బృందం

ABN , First Publish Date - 2022-05-17T04:55:04+05:30 IST

శాంతినగర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సోమవారం న్యాక్‌ బృందం పరిశీలించింది.

డిగ్రీ కళాశాలను పరిశీలించిన న్యాక్‌ బృందం
న్యాక్‌ బృందానికి స్వాగతం పలుకుతున్న ఎమ్మెల్యే అబ్రహాం

- స్వాగతం పలికిన అలంపూరు ఎమ్మెల్యే అబ్రహాం 

వడ్డేపల్లి, మే 16 : శాంతినగర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సోమవారం న్యాక్‌ బృందం పరిశీలించింది. అలంపూరు ఎమ్మెల్యే అబ్రహాంతో పాటు ప్రిన్సిపాల్‌ జి.పోషయ్య, అధ్యాపకులు బృందానికి ఘనంగా స్వాగతం పలికారు. బృందంలో ప్రొఫెసర్‌ ఏవీ ప్రసాదరావు, చైర్‌పర్సన్‌ (రాయలసీమ యూనివర్శిటీ వైస్‌ చాన్సిలర్‌), ప్రొఫెసర్‌ పర్వీన్‌ అక్తర్‌ పండిట్‌, మెంబర్‌ కోఆర్డినేటర్‌ (సెంట్రల్‌ యూనివర్శిటీ, కాశ్మీర్‌) డాక్టర్‌ ఎస్‌.ఎన్‌.వెంకటేష్‌, నంజన్‌గడ్‌ (ఫస్ట్‌గ్రేడ్‌ కాలేజీ, బెంగళూరు) ఉన్నారు. బృందం సభ్యులు విద్యార్థుల తల్లిదండ్రులను కళాశాలకు పిలిపించి మాట్లాడారు. కళాశాలలో బోధన, వసతులు, టెక్నికల్‌ అంశాలపై వారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి జాయింట్‌ డైరెక్టర్‌ రాజేంద్రసింగ్‌, అలంపూరు ఎమ్మెల్యే అబ్రహాం, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ కరుణసూరి, జడ్పీటీసీ సభ్యుడు రాజు, సీపీడీసీ సభ్యులు బసవ పూర్ణయ్య, రామ్మోహన్‌, కౌన్సిలర్‌ ఆంజనేయులు ఉన్నారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థినులు ప్రదర్శించిన సంప్రదాయ నృత్యాలు అందరినీ అలరించాయి. 


Updated Date - 2022-05-17T04:55:04+05:30 IST