వేటకు వెళ్లిన యువకుడి మృతి మిస్టరీ వీడింది
ABN , First Publish Date - 2022-01-24T06:31:24+05:30 IST
వన్యప్రాణుల వేటకు వెళ్లిన యువకుడు వ్యవసాయ బావిలో శవమై కనిపించిన కేసు మిస్టరీని కోటవురట్ల పోలీసులు ఛేదించారు.
కేసును చాకచక్యంగా ఛేదించిన పోలీసులు
ముగ్గురి అరెస్టు
వివరాలు వెల్లడించిన రూరల్ సీఐ
కోటవురట్ల, జనవరి 23 : వన్యప్రాణుల వేటకు వెళ్లిన యువకుడు వ్యవసాయ బావిలో శవమై కనిపించిన కేసు మిస్టరీని కోటవురట్ల పోలీసులు ఛేదించారు. ఇందుకు సంబంధించి నర్సీపట్నం రూరల్ సీఐ శ్రీనివాసరావు ఆదివారం సాయంత్ర విలేఖర్లకు తెలి పిన వివరాలివి. కోటవురట్ల మండలం పందూరు గ్రామానికి చెందిన మల్లవరపు నవీన్ (19), కాండ్రకోట సత్తిబాబు, రాజు కలిసి నాటు తుపాకీతో ఈ నెల 6వ తేదీ రాత్రి గాదుల కొం డకు వన్యప్రాణుల వేటకు వెళ్లారు. అలా వెళ్లిన వీరిలో తెల్లవారుజామున నవీన్ కనింపిచడం లేదని కుటుంబ సభ్యులకు సత్తిబాబు, రాజు సమాచారం అందించారు. ఎంత గాలించినా ఫలితం లేకపోవడంతో నవీన్ సోదరుడు దుర్గాప్రసాద్ ఈనెల 9న కోటవురట్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతలోనే ఆ మర్నాడు ఓ వ్యవసాయ బావిలో నవీన్ మృతదేహం బయటపడిన విషయం తెలిసిందే.
ఇదిలావుంటే, ఆరో తేదీన ఇదే మం డలం కైలాసపట్నానికి చెందిన వంతర కల్యాణ్, చిటికెల నూకరాజులు పందూరు గ్రామానికి చెందిన ఏలేశ్వరం ఈశ్వరరావుతో పందూరు గాదులకొండ ప్రాంతంలో అడవి జంతుల వేట కోసం ఇనుప తీగలను కరెంటు వైర్లకు కనెక్షన్ కలిపి దూరంగా వెళ్లిపోయినట్టు సీఐ చెప్పారు. అదే సమయంలో నవీన్, సత్తిబాబు, రాజు ముగ్గురూ నాటు తుపాకీతో వన్యప్రాణుల వేటకు వెళా ్లరని సీఐ చెప్పారు. వీరిలో నవీన్ తుపాకీ పట్టుకుని కొండ మీదకు వెళ్లగా, ఇంతలో పందుల కోసం అమర్చిన తీగ అతని కాలుకు తగలడంతో షాక్కు గురై అక్కడికక్కడే మృతిచెందినట్టు వివరిం చారు. మిగిలిన వారు ఏదో జంతువు పడి ఉంటుందని ఆశగా దగ్గరకు వెళ్లి చూడగా, నవీన్ మృతదేహం కనిపిం చింది. దీంతో ఈ విషయం బయట పడితే పోలీసు కేసు అవుతుందని భయ పడి బండరాయికి నవీన్ మెడ, భుజనానికి కలిపి బలంగా ఇనుప తీగ చుట్టి దగ్గరలో గల వ్యవసాయ బావిలో పడే శారని సీఐ చెప్పారు. దీనిపై వివిధ కోణాల్లో దర్యాప్తు జరిపి కేసును ఛేదిం చామన్నారు. ఈ ఘటనలో వంతర కల్యాణ్, చిటికెల నూకరాజు, ఏలేశ్వరం ఈశ్వరరావులను అరెస్టు చేసినట్టు సీఐ తెలిపారు.