చెట్టుపైనుంచి పడి యువకుడి దుర్మరణం

ABN , First Publish Date - 2021-04-13T06:29:08+05:30 IST

మండలంలోని కొలిమిపాళ్యం గ్రామాని కి చెందిన యువకుడు ఓబులేష్‌ (27) సోమవారం చెట్టుపైనుంచి కిందపడి మృతి చెందాడు.

చెట్టుపైనుంచి పడి యువకుడి దుర్మరణం
మృతుడు ఓబులేష్‌

కుందుర్పి, ఏప్రిల్‌  12: మండలంలోని కొలిమిపాళ్యం గ్రామాని కి చెందిన యువకుడు ఓబులేష్‌ (27) సోమవారం చెట్టుపైనుంచి కిందపడి మృతి చెందాడు. బంధువులు తెలిపిన వివరాలివి. బంధువుల గ్రామమైన కలిగొలిమిలో ఓబులేష్‌ కొబ్బరికాయల కోసం చెట్టు ఎక్కాడు. కాయలను తొలగిస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడి గాయపడ్డాడు. బాధితున్ని కళ్యాణదుర్గం తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతుడికి భార్య కావేలమ్మ, రెం డేళ్ల కూతురు ఉన్నారు. పెద్దదిక్కును కోల్పోయి బాధిత కుటుంబం వీధిన పడింది. అనాథలైన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. 

Updated Date - 2021-04-13T06:29:08+05:30 IST