ఉప్పల్‌‌లో సింగరేణి నిందితుడి కదలికలు

ABN , First Publish Date - 2021-09-15T22:42:19+05:30 IST

నగరంలో సంచలనం సృష్టించిన సైదాబాద్‌లో చిన్నారి అత్యాచారం, హత్య కేసులో

ఉప్పల్‌‌లో సింగరేణి నిందితుడి కదలికలు

హైదరాబాద్‌: నగరంలో సంచలనం సృష్టించిన సైదాబాద్‌లో చిన్నారి అత్యాచారం, హత్య కేసులో నిందితుడు రాజును పట్టుకోవడానికి పోలీసుల సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నది. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తోన్నారు.  నిందితుడు రాజు ఉప్పల్‌ వరకు వెళ్లినట్టు పుటేజ్‌లో గుర్తించారు. ఉప్పల్‌ సిగ్నల్‌లోని వైన్‌షాపు దగ్గర నిందితుడు కవర్‌ని పడేసాడు. కవర్‌లోని కల్లు సీసా, టవల్‌‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజు చేతిలో రూ.700 ఉన్నట్లు సీసీ పుటేజ్‌లో పోలీసులు గుర్తించారు.


నగరంలోని దాదాపు 180 వైన్‌షాపుల దగ్గర మఫ్టీలో పోలీసులు నిఘా పెట్టారు. నిందితుడి కోసం 1000 మంది పోలీసులు హైవేలను జల్లెడ పడుతున్నారు. టాస్క్‌ఫోర్స్, సీసీఎస్, ఎస్‌వోటీ బృందాలతో ముమ్మరంగా గాలిస్తున్నారు. రాత్రిలోగా నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. 

Updated Date - 2021-09-15T22:42:19+05:30 IST