అర్ధరాత్రి తల్లికి మెలకువ.. ఇంట్లో కనిపించని 21 ఏళ్ల కూతురు.. తలుపులు తీసి ఉండటంతో బయటకు వెళ్లి చూస్తే..

ABN , First Publish Date - 2021-11-13T00:15:26+05:30 IST

బరోడా గ్రామంలో నివాసం ఉంటున్న బిజేంద్ర( 24).. గురుగ్రామ్‌లోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తుండేవాడు. అతడికి ఏడాది క్రితం ఫేస్‌బుక్‌లో షమ్రీ గ్రామానికి చెందిన ఓ యువతి పరిచయమైంది. రోజూ చాటింగ్ చేసుకునే వారు. ఈ క్రమంలో

అర్ధరాత్రి తల్లికి మెలకువ.. ఇంట్లో కనిపించని 21 ఏళ్ల కూతురు.. తలుపులు తీసి ఉండటంతో బయటకు వెళ్లి చూస్తే..

హర్యానా సోనిపట్‌లోని గోహనాలో కుమార్తెతో కలిసి ఓ కుటుంబం నివాసం ఉంటోంది. అల్లారుముద్దుగా పెంచుకున్న తమ కుమార్తె అంటే తల్లిదండ్రులకు ఎంతో ప్రేమ. కూతురును చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేరు. అంతటి అనురాగాలతో నిండుకున్న ఆ కుటుంబంలో ఊహించని ఘటన జరిగింది. ఓ రోజు రాత్రి అంతా గాఢ నిద్రలో ఉన్నారు. అర్ధరాత్రి తల్లికి మెలకువ వచ్చి చూస్తే.. పక్కన ఉండాల్సిన కూతురు కనిపించలేదు. కంగారుగా బయటికి పరుగెత్తుకుంటూ వెళ్లి, అటూ ఇటూ చూసింది. అక్కడ కనిపించిన దృశ్యం చూసి షాక్ అయింది. తమ కుమార్తె ఓ వ్యక్తితో కలిసి వెళ్లిపోతున్నట్లు గమనించింది. దిగ్ర్భాంతికి గురైన ఆమె.. వెంటనే ఇంట్లో వాళ్లను లేపింది. అంతా కలిసి వారిని వెంబడించి పట్టుకున్నారు. తర్వాత ఏం జరిగిందంటే..


బరోడా గ్రామంలో నివాసం ఉంటున్న బిజేంద్ర( 24).. గురుగ్రామ్‌లోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తుండేవాడు. అతడికి ఏడాది క్రితం ఫేస్‌బుక్‌లో షమ్రీ గ్రామానికి చెందిన ఓ యువతి పరిచయమైంది. రోజూ చాటింగ్ చేసుకునే వారు. ఈ క్రమంలో ఒకరినొకరు ఇష్టపడ్డారు. అప్పటినుంచి వారి మధ్య ప్రేమాయణం నడుస్తూ ఉంది. ఇద్దరిదీ ఒకే కులమైనా.. వారి పెళ్లికి మాత్రం పెద్దలు అంగీకరించలేదు. అయినప్పటికీ ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. ఇంట్లో చెప్పకుండా పారిపోయి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. మంగళవారం రాత్రి యువతి ఇంటికి వెళ్లాడు. అప్పటికే సిద్ధంగా ఆమెను తీసుకుని పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే యువతి తల్లి గమనించడంతో ఇంట్లో వారంతా కలిసి వారిని వెంబడించి పట్టుకున్నారు.


నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి బిజేంద్రపై విచక్షణారహితంగా కొట్టారు. అంతటితో ఆగకుండా కర్రలు, కత్తులతో దాడి చేశారు. తీవ్ర గాయాలతో ఉన్న అతన్ని గోహనా ఆసుపత్రి వద్ద పడేసి, వారి బంధువులకు సమాచారం అందించారు. అయితే కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకునేలోపే అతను మృతి చెందాడు. పోస్టుమార్టం రిపోర్టులో మృతుడి జననాంగాలపై లోతైన గాయాలున్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై తమకు ఆలస్యంగా ఫిర్యాదు అందిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Updated Date - 2021-11-13T00:15:26+05:30 IST