అధికారుల తీరుపై ఎమ్మెల్సీ ఆగ్రహం
ABN , First Publish Date - 2022-10-02T06:26:57+05:30 IST
మండల సర్వసభ్య సమావే శం గరంగరంగా సాగింది. శనివారం ఎంపీపీ చెన్ను అనురాధసుందర్రెడ్డి అ ధ్యక్షతన శనివారం నిర్వహించిన మండ ల సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్సీ కోటిరెడ్డి హాజరై మాట్లాడారు.
పెద్దవూర, అ క్టోబరు 1: మండల సర్వసభ్య సమావే శం గరంగరంగా సాగింది. శనివారం ఎంపీపీ చెన్ను అనురాధసుందర్రెడ్డి అ ధ్యక్షతన శనివారం నిర్వహించిన మండ ల సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్సీ కోటిరెడ్డి హాజరై మాట్లాడారు. ప్రొటోకాల్ నిబంధనలను సరిగా పాటించకపోవడంపై అధికారులను నిలదీసి ఆగ్రహం వ్య క్తం చేశారు. అధికారిక కార్యక్రమాలకు సమాచారం అందించకపోవ డం, విద్యుతశాఖ ఏఈతో పాటు పలువురు అధికారుల గైర్హాజర్పై స మాచారం అందించలేదా ఎంపీడీవోను ఆయన ప్రశ్నించారు. అధికారు లు ప్రజాప్రతినిధులను గౌరవించాలన్నారు. సమన్వయంతో ముందుకు సాగాలని ఆయన సూచించారు. వివిధ శాఖల అధికారులు సమీక్షలో పాల్గొన్నారు. సమావేశంలో ఎంపీడీవో శ్యామ్, వైస్ ఎంపీపీ వివేక్రావు, ఎంపీటీసీలు, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.