శిలాఫలకంపై ఎమ్మెల్యే ముఖ చిత్రాన్ని తొలగించాలి
ABN , First Publish Date - 2021-08-04T04:55:23+05:30 IST
మండలంలోని మద్దిమడుగు పుణ్యక్షేత్రం రాజగోపురం ప్రారంభోత్సవ కార్యక్రమం లో ఏర్పాటు చేసిన శిలాఫలకంపై ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ముఖచిత్రాన్ని వెంటనే తొలగించాలని డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ వంశీకృష్ణ డిమాండ్ చే శారు.
పదర, ఆగస్టు 3 : మండలంలోని మద్దిమడుగు పుణ్యక్షేత్రం రాజగోపురం ప్రారంభోత్సవ కార్యక్రమం లో ఏర్పాటు చేసిన శిలాఫలకంపై ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ముఖచిత్రాన్ని వెంటనే తొలగించాలని డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ వంశీకృష్ణ డిమాండ్ చే శారు. మంగళవారం కాంగ్రెస్ కార్యకర్తల ఆధ్వర్యం లో మద్దిమడుగు పుణ్య క్షేత్రంలోని పబ్బతి ఆంజనే యస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ ఏడు సంవత్సరాలుగా ఎమ్మెల్యే పదవి అనుభవిస్తూ ఈ ప్రాంతాన్ని ఏవిధంగా అభివృద్ధి చేయలేదని, హామీలకే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. దే వస్థాన చైర్మన్, అధికారులు జరిగిన తప్పిదాన్ని వా రం రోజుల్లో సరి చేసుకోవాలని, లేనియేడల ప్రజ లు, భక్తుల ఆగ్రహానికి గురవుతారని హెచ్చరించా రు. ఆలయాన్ని నమ్ముకొని రోడ్డుకి ఇరువైపులా ఉన్న దుకాణాదారులకు అటవీశాఖ అధికారులచే నోటీసులు ఇప్పిస్తూ భయాబ్రాంతాలకు గురి చేయ డం సరైన పద్ధతి కాదని హితువు పలికారు. కాంగ్రె స్ పార్టీ అధికారంలోకి వస్తే షాపింగ్ కాంప్లెక్స్ క ట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పదర, అమ్రాబాద్ మండల అధ్యక్షుడు ఏఆర్.యా దవ్, బుచ్చయ్య, అమ్రాబాద్ ఎంపీపీ శ్రీనివాసులు, ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.